ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు: బీజేవైఎం
షాద్నగర్లో బీజేవైఎం భారీ నిరసన.. బకాయిల విడుదలకు డిమాండ్
నవోదయం/షాద్ నగర్, ఆగస్టు19
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో షాద్నగర్లో భారీ నిరసన, ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు షాద్నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అభినవ్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా విద్యార్థుల పరిస్థితుల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం మాటల్లో కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారంలోనూ చిత్తశుద్ధి చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు వంశీకృష్ణ, లక్ష్మీకాంత్రెడ్డి, చెట్ల వెంకటేష్, శ్రీనివాస్చారి, ఉదయ్గౌడ్, అల్లం అనిల్, ప్రశాంత్గౌడ్, సూర్యగౌడ్, సుధాకర్ అప్ప, శివాజీ, వివేక్, శివ, శ్రీశైలం, యాదయ్య, అభిలాష్, శ్రీధర్, విజయ్, రామకృష్ణ, రావుల రాకేష్, చందుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Telangana
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
Quick Summary:
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
